Venkata Gowda: పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్ లు అందించిన పలమనేరు ఎమ్మెల్యే... ఈసీ ఆగ్రహం

  • ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
  • తన ఫొటోలతో ఉన్న ప్యాడ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెంకట గౌడ
  • వి.కోట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు 
EC fires on Palamaneru MLA Venkate Gowda

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కోడ్ అమల్లో ఉన్న సమయంలో పదో తరగతి విద్యార్థులకు తన ఫొటోలతో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేసిన పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే ఎన్. వెంకట గౌడ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకట గౌడ ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడంటూ ఈసీ చర్యలకు దిగింది. 

ఎమ్మెల్యే ఫొటోలతో ఉన్న ప్యాడ్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడాన్ని పలమనేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎగ్జామినర్లు గమనించారు. దీనిపై వారు పలమనేరు ఆర్డీవో మనోజ్ రెడ్డికి సమాచారం అందించారు. దాంతో, ఆర్డీవో పలమనేరు ఎమ్మెల్యేపై వి.కోట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ క్రమంలో అధికారులు పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడకు షోకాజ్ నోటీసులు అందించారు.

More Telugu News